పెనమలూరులో ఉద్రిక్తత.. పేర్ని నాని దిష్టిబొమ్మ దహనం

కృష్ణా జిల్లా పెనమలూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది...

Update: 2024-09-26 14:50 GMT

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా పెనమలూరు (Penamaluru)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక్కసారిగా జనసేన నేతలు (Janasena Leaders) ఆందోళనకు దిగారు. రోడ్డుపైకి వచ్చి మాజీ మంత్రి పేర్ని నాని (Former Minister Perni Nani) దిష్టి బొమ్మను దహనం చేశారు. తిరుమల లడ్డూ(Tirumala Laddu) వ్యవహారంలో డిప్యూటీ సీఎం పవన్‌(Deputy Cm Pawan Kalyan)పై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. అధికారం పోయినా పేర్ని నాని పొగరుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పేర్ని నాని తీరును తప్పుబడుతూ ‘ఖబద్దార్’ అంటూ హెచ్చరించారు.


‘‘గత ప్రభుత్వంలో తిరుమల లడ్డూను వైసీపీ నేతలు అపవిత్రం చేశారు. దేవుడిని క్షమించమంటూ ప్రాయశ్చిత్తంగా పవన్ కల్యాణ్ దీక్ష చేస్తున్నారు. మిమ్మల్ని క్షమించమని పవన్ దుర్గమ్మ మెట్లు శుభ్రం చేశారు. మానవాలి చేయని తప్పును వైసీపీ నేతలు చేశారు. తప్పును సరిదిద్దుకోకుండా చిత్తశుద్ధితో దీక్ష చేస్తున్న పవన్‌ను విమర్శిస్తున్నారు. పేర్ని నాని మానవ సైకోగా ప్రవర్తిస్తున్నారు. పేర్నినానికి ఎప్పుడో రాజకీయ సన్యాసం చేశాం. ఇకపై ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోయారు. పవన్ కల్యాణ్, చంద్రబాబుపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోం.’’ అని పెనమలూరు జనసేన నేతలు, కార్యకర్తలు హెచ్చరించారు.


Similar News