పది అడుగుల భారీ కొండచిలువ.. కొట్టి చంపిన యువకులు

కాకినాడ జిల్లా రామచంద్రపురంలో పది అడుగుల భారీ కొండచిలువ హల్ చల్ చేసింది...

Update: 2024-09-26 16:26 GMT

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా రామచంద్రపురం(Ramachandrapuram)లో పది అడుగుల భారీ కొండచిలువ (Python) హల్ చల్ చేసింది. స్థానిక ఏటిగట్టు వద్ద మొక్కలకు రక్షణగా వేసిన వలలో చిక్కుకుంది. దీంతో కొండచిలువను చూసి యువకులు ఉలిక్కి పడ్డారు. ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే కర్రలతో కొట్టి చంపారు. ఏలూరు కాల్వకు వరద నీరు భారీగా చేరడంతో కొండచిలువులు వస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.





Similar News