ప్రసంగంలో ఒక్కటీ నిజం లేదు.. బైబై జగన్ అంటూ వాకౌట్

టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ ప్రసంగం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

Update: 2024-02-05 07:17 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో ఇవ్వాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగానే ఉభయసభలను ఉద్దేశించి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ ప్రసంగం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసంగంలో ఒక్కటి కూడా నిజం లేదని, వాస్తవాలను పక్కనబెట్టి, వైసీపీ వాళ్లు రాసిచ్చిన స్క్రిప్ట్ యదావిధిగా చదివారని మండిపడ్డారు. సభను వాకౌట్ చేస్తున్నట్లు టీడీపీ నేతలు ప్రకటించారు. అంతేగాక, పొలవరం ఎక్కడా, మెగా డీఎస్సీ ఎక్కడా, సీపీఎస్ ఎక్కడా, జాబ్ గ్యారెంటీ ఎక్కడా, ప్రత్యేక హోదా ఎక్కడా, బైబై జగన్ అంటూ ఫ్లకార్టులు పట్టుకొని.. నినాదాలు చేసుకుంటూ బయటకి వచ్చారు. గవర్నర్ ప్రసంగానికి నిరసనగా, ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నిరసన తెలుపుతూ.. అసెంబ్లీ ఎదుట రోడ్డుపై బైఠాయించారు.

Tags:    

Similar News