వరదల్లో చిక్కుకున్న ముగ్గురి ప్రాణాలు కాపాడిన సూపర్ హీరో.. తాను మాత్రం!?
ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు(Heavy Rains) విజయవాడ జిల్లాను బుడమేరు(Budameru) వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే.
దిశ,వెబ్డెస్క్: ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు(Heavy Rains) విజయవాడ జిల్లాను బుడమేరు(Budameru) వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. దీంతో ఇళ్లలోకి వరద(Flood) నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు(Problems) ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి బుడమేరు వరద(Budameru Flood) నీరు ప్రజలను ఎంతగా అతలాకుతలం చేసిందో అందరికీ తెలిసిందే. ఈ భారీ విపత్తు వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. చాలా మంది ఇల్లు మునిగిపోయాయి. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇలాంటి ఘటనే మరొకటి ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే..సింగ్నగర్లో వరదల్లో(Floods) చిక్కుకున్న ఓ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వరదల్లో చిక్కుకున్న నలుగురిని కాపాడేందుకు ఓ యువకుడు పెద్ద సాహసమే చేశాడు. తన డెయిరీ ఫాం లో చిక్కుకున్న అన్నతో పాటు మరో ఇద్దరు వర్కర్లను కాపాడేందుకు చంద్రశేఖర్ అనే యువకుడు వెళ్లాడు. అయితే వీళ్లని కాపాడి ఒడ్డుకు చేర్చిన తర్వాత అదే నీటిలో ఆ యువకుడు నీటి ఉధృతికి కొట్టుకుపోయాడు. చంద్రశేఖర్కు 15 నెలల క్రితమే వివాహం జరిగింది. నలుగురిని కాపాడి తన ప్రాణాలను విడిచిన చంద్రశేఖర్పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెళ్లు వెత్తుతున్నాయి. ‘చంద్రశేఖర్ సూపర్ హీరో’ అంటూ పోస్టులు పెడుతున్నారు.