ఆసక్తికరంగా విశాఖ సిద్ధం బహిరంగ సభ.. ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చిన జగన్

ఈ రోజు విశాఖపట్నంలో వైసీపీ నేతలు సిద్ధం బహిరంగ సభను నిర్వహించారు.

Update: 2024-01-27 10:23 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ రోజు విశాఖపట్నంలో వైసీపీ నేతలు సిద్ధం బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో ప్రతిపక్ష నేతలపై వ్యంగ్యాస్త్రాలను వైసీపీ సంధించింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓ ఇంట్రెస్ట్ క్యారెక్టర్ లకి సంబంధిచిన కార్టూన్ ఫోటోలను ఆ సభలో ఏర్పాటు చేశారు. సభ లోని 30వ నెంబర్ గ్యాలరీని పూర్తిగా ఈ కార్టూన్ పిక్స్ కోసం కేటాయించారు.

కాగా ఈ గ్యాలరీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బీజేపీ, జనసేన, టీడీపీ, కాంగ్రెస్ కి సంబంధించిన నేతల కార్టూన్ ఇమేజెస్ ని ఏర్పాటు చేశారు. ఇక ఈ కార్టూన్స్ లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి సంబందించిన కార్టూన్ లు రాక్షసుడిని పొలిఉన్నాయి. కాగా వైసీపీని తిరిగి అధికారం లోకి రానివ్వను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇలా వైసీపీ పవన్ కార్టూన్స్ ను రాక్షసుడిలా ప్రదర్శించడం గమనార్హం.

ఇక ఆంధ్రకు గజదొంగల అన్యాయం అంటూ పాంప్లేట్లను కూడా రూపొందించారు. కాగా ఆ పాంప్లేట్ల పై భాగంలో ఆంధ్రకు అన్యాయం చేసిన గజదొంగలుగా కాంగ్రెస్, జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలను చూపిస్తూ.. కింద భాగంలో ఆంధ్ర కోసం ఒంటరిగా పోరాడుతున్నది ఒకే ఒక్కడు అంటూ జగన్ ఫోటో ఉంది. కాగా 30వ నెంబర్ గ్యాలరీలో లో ఏర్పాటు చేసిన కార్టూన్స్ సభకు వస్తున్న ప్రజలను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. సభకు వస్తున్న ప్రతి ఒక్కరు ముందుగా 30వ నెంబర్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన కార్టూన్స్ చూడడానికి ఆసక్తికనబరుస్తున్నారు. 

Tags:    

Similar News