ఏపీలో వేగంగా మారుతున్న సీన్.. సెలవుపై వెళ్లాల్సిందిగా సీఎస్‌కు ఆదేశాలు జారీ

ఏపీలో కూటమి విజయం తర్వాత వేగంగా పరిణామాలు మారుతున్నాయి.

Update: 2024-06-06 08:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కూటమి విజయం తర్వాత వేగంగా పరిణామాలు మారుతున్నాయి. ఏపీ సీఎంగా చంద్రబాబు ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేయనుండగా.. సెలవుపై వెళ్లాల్సిందిగా సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఆయన సెలవు పెట్టి వెళ్లిపోయారు. సాయంత్రం లోగా ఏపీకి కొత్త సీఎస్ ను నియమించే చాన్స్ ఉంది. ఇప్పటికే ఉన్న సలహాదారులను సైతం వెంటనే తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటివరకు రాజీనామా చేయని సలహాదారులను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అనారోగ్య కారణాలతో ఇప్పటికే ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ సెలవుపై వెళ్లారు. 


Similar News