AP News:ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభం

ఇటీవల కురిసిన భారీ వర్షాలు రాష్ట్రాన్ని వరదలతో ముంచేత్తాయి. ఈ భారీ వరదల సమయంలో నాలుగు బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి.

Update: 2024-09-10 09:17 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఇటీవల కురిసిన భారీ వర్షాలు(Heavy Rains) రాష్ట్రాన్ని వరదలతో ముంచేత్తాయి. ఈ భారీ వరదల(Floods) సమయంలో నాలుగు బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి. బోట్లు ఢీకొని మూడు గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై ఇప్పటికే టీడీపీ(TDP), వైసీపీ(YCP) మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రకాశం బ్యారేజీ(A barrage of light) వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియను జలవనరుల శాఖ(Department of Water Resources) ప్రారంభించింది. 50 టన్నుల బరువు ఎత్తే కెపాసిటీ ఉన్న 2 క్రేన్లతో పనులు చేపట్టింది. ఈ నెల 1వ తేదీన ఎగువ నుంచి కొట్టుకువచ్చిన 4 పడవలు 67, 68, 69 గేట్ల వద్ద చిక్కుకోగా, అవి ఢీకొని బ్యారేజ్ కౌంటర్ వెయిట్లు ధ్వంసమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 2,09,937 క్యూసెక్కుల వరద(Floods) దిగువకు ప్రవహిస్తుండగా, 68, 69 గేట్లను క్లోజ్ చేసి పనులు జరిపిస్తున్నారు.


Similar News