ముద్రగడకు గ్రాండ్‌గా నామకరణం.. నెట్టింట వైరల్

ఏపీలో కూటమి ఘన విజయం సాధించగా వైసీపీ 11 సీట్లకే పరిమితమై ఘోర పరాభవాన్ని మూట గట్టుకుంది.

Update: 2024-06-05 04:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కూటమి ఘన విజయం సాధించగా వైసీపీ 11 సీట్లకే పరిమితమై ఘోర పరాభవాన్ని మూట గట్టుకుంది. చంద్రబాబు, పవన్ కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. నేడు ఇద్దరు నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనుండగా ఈ కార్యక్రమానికి మోడీని ఆహ్వానించేందుకు నేతలు వెళ్తున్నారు. కాగా, ఈ సందర్భంగా ఏపీలో ముద్రగడ పద్మనాభం పేరు మార్పు అంశం హాట్ టాపిక్ గా మారింది. తొలి నుంచి కాపు నేతగా ఉన్న ముద్రగడ ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి పవన్ కల్యాణ్‌పై ఘాటు విమర్శలు చేశారు.

పిఠాపురంలో పవన్ గెలిస్తే తాను పేరు మార్చుకుంటానని ముద్రగడ సవాల్ విసిరారు. దీంతో తాజాగా కొంత మంది జనసేన అభిమానులు ముద్రగడ నూతన నామకరణ మహోత్సవం పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముద్రగడ ఫొటో ముందు అరటి పండ్లు, కేక్ ఉంచి పద్మనాభరెడ్డి అంటూ మూడు సార్లు ఫొటో వద్ద చెవిలో చెప్పి ఒరిజినల్ నామకరణను తలపించారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ‘మీ గోదారోళ్ల వెటకారానికి ఒక నమస్కారం అన్న..’ ‘మేము ఉప్మా రెడ్డి అని పెడితే మీరు పద్మనాభ రెడ్డి అని పెట్టారు’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. 


Similar News