AP News:మాజీ సీఎం జగన్‌కు హైడ్రా నోటీసులు..క్లారిటీ ఇదే!?

ఏపీ మాజీ సీఎం జగన్‌కు హైడ్రా నోటీసులు ఇచ్చిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Update: 2024-08-31 10:27 GMT

దిశ,వెబ్‌డెస్క్:గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో ఏపీ మాజీ సీఎం జగన్‌కు హైడ్రా నోటీసులు ఇచ్చిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌కు చెందిన లోటస్ పాండ్..ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఉందని, త్వరలోనే దానిని హైడ్రా కూల్చి వేస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల పై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..వైెఎస్ జగన్‌కు నోటీసులు ఇవ్వలేదని, సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేడు(శనివారం) ఉదయం పటాన్‌చెరులో పర్యటించారు. అధికారులతో కలిసి స్థానిక సాకి చెరువును పరిశీలించారు. కబ్జాకు గురైన ప్రాంతం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ చెరువులో ఇప్పటికే 18 అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు ఆయన తెలిపారు.


Similar News