AP Politics:‘పరామర్శకు వెళ్లి పథకాల గురించి మాట్లాడతారా?’ ..ఆగ్రహం వ్యక్తం చేసిన హోం మంత్రి

వైసీపీ అధినేత జగన్‌పై హోం మంత్రి అనిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో ఎన్ని హత్యలు, అత్యాచారాలు జరిగాయో గుర్తు చేసుకోవాలన్నారు.

Update: 2024-07-21 09:32 GMT

దిశ,వెబ్‌డెస్క్:వైసీపీ అధినేత జగన్‌పై హోం మంత్రి అనిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో ఎన్ని హత్యలు, అత్యాచారాలు జరిగాయో గుర్తు చేసుకోవాలన్నారు. పోలీసులను ప్రజల రక్షణకు కాకుండా తన రక్షణకు జగన్ వినియోగించుకున్నారని ఆరోపించారు. బుధవారం అర్ధరాత్రి దారుణంగా హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబానికి జగన్ ఎంత పరిహారం ఇచ్చారని హోం మంత్రి అనిత ప్రశ్నించారు. వైఎస్ జగన్ రషీద్ కుటంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే. పరామర్శకు వెళ్లి పథకాల గురించి మాట్లాడటం ఏంటని మంత్రి ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై బురద చల్లడానికి వైఎస్ జగన్ ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అనిత విమర్శలు గుప్పించారు. నాలుగు రాజకీయ హత్యలు జరిగాయి. వీటిలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు చనిపోయారు. 36 రాజకీయ హత్యలు జరిగినట్లు జగన్ ఆరోపించారు. వైఎస్ జగన్ చేస్తున్న ఆరోపణలపై వారి వద్ద వివరాలు ఉంటే నాకు సమాచారం ఇవ్వాలని ఆమె అన్నారు. లేకపోతే మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని ఫైరయ్యారు. ఇంకా ప్రజలు మీ మాటలు నమ్ముతారని భావిస్తున్నారా? అని హోం మంత్రి అనిత ప్రశ్నించారు.

Tags:    

Similar News