పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి చదువే: బాలబాలికలు సీఎం జగన్ శుభాకాంక్షలు

మన పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి చదువేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.

Update: 2023-11-14 12:25 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : మన పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి చదువేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఆ దిశగా అడుగులు వేస్తూ, ప్రపంచ స్థాయి విద్యకు పెద్ద పీట వేస్తూ, ఇంగ్లీష్ మీడియం బోధనను తీసుకొచ్చాం అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. బాలల దినోత్సవం సందర్బంగా సీఎం వైఎస్ జగన్ బాలబాలికలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘మ‌నం మ‌న పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చ‌దువు. ఆ దిశగా అడుగులు వేస్తూ, ప్రపంచస్థాయి విద్యకు పెద్దపీట వేస్తూ, ఇంగ్లీష్ మీడియం బోధనను తీసుకువ‌చ్చాం. మ‌న పిల్లలు జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో క్రీడ‌ల‌కు ప్రాధాన్యత పెంచాం. అంగన్‌వాడీల నుంచి కాలేజీల వ‌ర‌కు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం. దేశ తొలి ప్రధాని పండిట్ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ జ‌యంతి సంద‌ర్భంగా ఆయనకి ఘన నివాళులు. మరియు రాష్ట్రంలోని బాలబాలికలందరికీ బాల‌ల దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. అంతకు ముందు దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.

Tags:    

Similar News