AP News:‘పొలం పిలుస్తుంది’ పోస్టర్ రిలీజ్..!

జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గ్రామంలో శనివారం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ‘పొలం పిలుస్తుంది’ పోస్టర్ రిలీజ్ చేశారు.

Update: 2024-08-31 11:32 GMT

దిశ, జీలుగుమిల్లి:జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గ్రామంలో శనివారం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ‘పొలం పిలుస్తుంది’ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ విస్తరణ కార్యక్రమంలో భాగంగా ప్రతి మంగళ, బుధవారాల్లో ఈ కార్యక్రమాన్ని జరిపించ వలసిందిగా కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రోజుకి రెండు గ్రామాల చొప్పున వ్యవసాయ శాఖ అధికారులు మరియు కూటమి నాయకులు ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం ద్వారా వ్యవసాయ రైతులకు తగు సూచనలు సలహాలు ఇస్తూ వ్యవసాయ దిగుబడికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ముందుకు తీసుకువెళ్లాలని తగు సూచనలు ఇచ్చారు. అలాగే ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సీఎం నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Similar News