శ్రీసత్యసాయి జిల్లాలో చిరుత మృతి కలకలం

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో చిరుతపులి మృతి కలకలం రేపుతోంది.

Update: 2023-10-18 05:53 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో చిరుతపులి మృతి కలకలం రేపుతోంది. బత్తులపల్లి మండలం డి.చెర్లోపల్లి గ్రామం వద్ద రైలు పట్టాలపై పులి మృతదేహం కనిపించింది. అయితే ఈ విషయాన్ని పోలీసులు, రైల్వే శాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టారు. చిరుత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించారు.బుధవారం తెల్లవారు జామున గ్రామంలోకి రావాలని రైల్వే ట్రాక్ దాటుతూ రైలు కింద పడి ప్రమాదవశాత్తు చిరుత చనిపోయి ఉండొచ్చని మరికొందరు చెప్తున్నారు. అయితే చిరుత గోళ్లు లేకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా వేటాడి చిరుత గోళ్లు తొలగించి రైలు కింద పడేశారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


Similar News