‘తిరుమల లడ్డూ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వండి’.. టీటీడీ ఈవోను ఆదేశించిన సీఎం

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం పై రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.

Update: 2024-09-20 10:58 GMT

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం పై రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిన కల్తీ నెయ్యిని వాడుతున్నారని సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఆరోపణలతో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ లడ్డూ వివాదం విషయంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కల్తీ నెయ్యి ఆరోపణలపై వైసీపీ హైకోర్టును కూడా ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో, సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూ(Tirumala Laddu) కల్తీ వ్యవహారంపై మంత్రులు, అధికారులతో ఈ రోజు(శుక్రవారం) మధ్యాహ్నం సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ఆదేశించారు. ఈ సాయంత్రం లోపు నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శ్రీవారి ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


Similar News