ఏపీలో వెనుకబడిన జిల్లాలకు భారీగా గ్రాంట్లు విడుదల చేసిన కేంద్రం

కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక నిధులను కేటాయించింది.

Update: 2024-07-29 10:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక నిధులను కేటాయించింది. విభజన హామీల్లో భాగంగా రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పుకొచ్చారు. అలాగే అమరావతి నిధులతో పాటు రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోన ఈ నెల 27న జరగిని నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు కూడా గుర్తు చేశారు. ఈ క్రమంలో రూ.2,100 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ ప్రతిపాదించింది. దీంతో జిల్లాకు రూ.300 కోట్ల చొప్పున 7 జిల్లాలకు కేంద్ర గ్రాంట్లు విడుదల చేసింది. ఇదే విషయంపై కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడు.. నీతి ఆయోగ్‌ సిఫార్సు మేరకు ఏపీ రాష్ట్రంలోని వెనుకబడిన 7 జిల్లాలకు రూ.1750 కోట్లు విడుదల చేశామని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News