ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం.. నాలుగే అంశాలే ప్రధాన ఎజెండాగా కేబినేట్ భేటీ

ఏపీలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది.

Update: 2024-07-16 05:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో నాలుగు అంశాలే ప్రధాన ఎజెండాగా ఉన్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఒకటి. ఇసుక పాలసీ జీవోకి ఆమోదం.. పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ రుణాలకు ఆమోదంపై చర్చించనున్నారు. అలాగే తల్లికి వందనం, ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన గైడ్ లైన్స్ పైన మాట్లాడనున్నారు. ఇక చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం మంత్రులతో వరుస సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేసే యోచన చేస్తున్నారు. ఇప్పటికే బాబు పాలనలో ప్రజలకు మంచి చేయడంతో సీఎంపై ఏపీ ప్రజలు గట్టి నమ్మకంతో ఉన్నారు. 


Similar News