Ap News: శ్రీరామాలయం రథానికి నిప్పు.. కేసు నమోదు

అనంతపురం జిల్లా కనేకల్‌ మండలం హనకనహాల్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది....

Update: 2024-09-24 05:36 GMT

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా కనేకల్‌ మండలం హనకనహాల్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీరామాలయం రథానికి(Sriramalayam Ratham) గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి నిప్పుపెట్టారు. దీంతో స్థానికులు మంటలార్పారు. పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక సీసీ ఫుటేజులను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో రథం సగానికి పైగా దగ్ధమైంది. అయితే ఘటనాస్థలం వద్ద బీజేపీ (Bjp),  బజరంగ్ దళ్ (Bajrang Dal) కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. రథానికి నిప్పు పెట్టిన దుండగలను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 


Similar News