చీర, జాకెట్, పూలతో అంబటి రాంబాబుకు టీడీపీ నేతల స్పెషల్ ఇన్విటేషన్

ఏపీలో ఎన్డీయే కూటమి ధాటికి వైసీపీ ఏకంగా 11 ఎమ్మెల్యే స్థానాలకు పరిమితమైన విషయం తెలిసిందే.

Update: 2024-06-10 08:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ధాటికి వైసీపీ ఏకంగా 11 ఎమ్మెల్యే స్థానాలకు పరిమితమైన విషయం తెలిసిందే. కాగా, ఇటీవల పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటా అని ముద్రగడ చెప్పగా ఫలితాల తర్వాత ఆయనకు జనసేన కార్యకర్తలు నామకరణ మహోత్సవం నిర్వహించారు. పద్మనాభ రెడ్డిగా పేరు మారుస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా వైసీపీ నేత అంబటి రాంబాబుకు టీడీపీ విద్యార్థి నేతలు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వినూత్నంగా ఆహ్వానించారు. అంబంటి రాంబాబుకు చీర, జాకెట్, పూలు ఇచ్చేందుకు తెలుగు విద్యార్థి నేతలు రాగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అంబటి ఫొటోకు బొట్టు పెట్టి కుర్చీలో చీర, జాకెట్, పూలు ఉంచి ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానం పలికారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  


Similar News