టీడీపీ-జనసేనలది అక్రమ కలయిక.. చంద్రబాబుకు ఆయనవల్లే ప్రాణహాని: మంత్రి కొట్టు సత్యనారాయణ

తెలుగుదేశం పార్టీకి అధినేత చంద్రబాబు నాయుడుకు ఆయన తనయుడు నారా లోకేశ్‌ వల్లే ప్రాణహాని ఉందని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు.

Update: 2023-10-30 12:32 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీకి అధినేత చంద్రబాబు నాయుడుకు ఆయన తనయుడు నారా లోకేశ్‌ వల్లే ప్రాణహాని ఉందని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు జైలుకెళ్తే ప్రజలు ఎవరూ బాధపడటం లేదని కావాలనే టీడీపీ రాద్దాంతం చేస్తోందని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. న్యాయస్థానాలను సైతం తప్పుబట్టేలా నారా భువనేశ్వరి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును అన్యాయంగా.. అక్రమంగా అరెస్ట్ చేశారని పదేపదే అంటున్నారని అంటే ఆమె ఉద్దేశం న్యాయస్థానాలు సైతం అక్రమంగా జైల్లో పెట్టాయా అని ఆరోపించారు. కన్న తండ్రి నందమూరి తారకరామారావుకు వెన్నుపోటు పొడిచి.. ఆయన చావుకు కారణమైన చంద్రబాబుపై స్పందించని భువనేశ్వరి భర్త జైలుకెళ్తే పోరాటం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నాడు దివంగత ఎన్టీఆర్ విషయంలో ఎన్టీఆర్‌ది తప్పు, చంద్రబాబుదే కరెక్ట్ అని భువనేశ్వరి చెప్పగలరా అని నిలదీశారు. మరోవైపు టీడీపీ, జనసేన పొత్తులపైనా మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ - జనసేనలది అక్రమ కలయిక అని విమర్శలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో రెండు పార్టీల మధ్య సీట్ల గొడవ ఉందని చెప్పుకొచ్చారు. కాపులు సిగ్గు పడేలా పవన్ కల్యాణ్ తీరు ఉందని...ఆర్థిక లబ్ధి కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. 

Tags:    

Similar News