Gudlavalleru:విద్యార్థినుల ఆందోళన..హుటాహుటీన కాలేజీకి మంత్రి

గుడ్లవల్లేరులో హిడెన్ కెమెరాల వ్యవహారంలో విద్యార్థినులు చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చుతోంది.

Update: 2024-08-30 08:29 GMT

దిశ,వెబ్‌డెస్క్:గుడ్లవల్లేరులో హిడెన్ కెమెరాల వ్యవహారంలో విద్యార్థినులు చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ మేరకు తమకు వెంటనే న్యాయం చేయాలంటూ గర్ల్స్ హాస్టల్ ఎదుట విద్యార్థినులు బైఠాయించగా..వారికి విద్యార్థి సంఘాల నాయకులు సంఘీభావం తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు. ఈ ఘటన నేపథ్యంలో సీఎం ఆదేశాలతో హుటాహుటీన మంత్రి కొల్లు రవీంద్ర కాలేజీకి వెళ్లారు. అక్కడ ఆందోళన చేస్తున్న విద్యార్థినులతో మాట్లాడారు. ఈ క్రమంలో ఘటన పై విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఘటనపై స్పందించిన హోం మంత్రి అనిత హిడెన్ కెమెరాల అంశం పై విచారణకు ఆదేశించామని చెప్పారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాలేజిల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామన్నారు.


Similar News