శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు Cm Jagan.. షెడ్యూల్ ఇదే..!

సీఎం జగన్ బుధవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. నరసన్నపేటలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీసర్వే) రెండు విడత కార్యక్రయాన్ని ఆయన ప్రారంభించనున్నారు...

Update: 2022-11-22 16:25 GMT

దిశ వెబ్ డెస్క్: సీఎం జగన్ (Cm Jagan) బుధవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. నరసన్నపేటలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీసర్వే) రెండు విడత కార్యక్రయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ బుధవారం ఉదయం 8.30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి బయల్దేరి 11 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం నరసన్నపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ సభలోనే వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం తిరిగి 3.25 గంటలకు తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు. 

Tags:    

Similar News