Nellore: బైక్‌ను ఢీకొట్టిన కారు.. తండ్రీ, కుమార్తె దుర్మరణం

నెల్లూరు జిల్లా రాపూరు మండలం వెలుగోను జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది...

Update: 2023-02-04 10:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు జిల్లా రాపూరు మండలం వెలుగోను జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు-బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తండ్రీకుమార్తె మృతి చెందగా కొడుకు తీవ్ర గాయాలపాలయ్యారు. గుండవోలుకు చెందిన గంగోడి ప్రతాప్ కుమార్తె వైష్ణవి, కుమారుడు సిద్ధార్థలతో కలిసి బైక్‌పై రాపూరు వెళ్తున్నారు. అయితే వెలుగోను జంక్షన్ వద్ద పెంచలకొన నుంచి రాపూరు వైపు వస్తున్న కారు టైరు పగిలింది. దీంతో బైక్‌‌ను ఆ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో గంగోడి ప్రతాప్, కుమార్తె వైష్ణవి అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు సిద్ధార్థ తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న రాపూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రాపూరు ఎస్ఐ క్రాంతికుమార్ ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలు అయిన సిద్ధార్థను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News