వరదలతో రాష్ట్రం అల్లకల్లోలం.. పుట్టినరోజు వేళ స్పీకర్ కీలక నిర్ణయం?

గత మూడు రోజు నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి.

Update: 2024-09-03 12:04 GMT

దిశ,వెబ్‌డెస్క్:గత మూడు రోజు నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. వర్షాలు, వరదల ప్రభావంతో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. విజయవాడలో 2.76 లక్షల మంది వరద బాధితులు ఉన్నారు. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోరాదని నిర్ణయించుకున్నారు. "తుపాను కారణంగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే రేపు (సెప్టెంబర్ 4) నా జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. దయచేసి నా అభిమానులు, నియోజకవర్గ ప్రజలు ఎవరూ కూడా ఎలాంటి వేడుకలు జరుపవద్దు. ఆ ఖర్చుతో వరద బాధితులకు సహాయం చేయాలని నా మనవి" అని అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.


Similar News