నితీష్ అలా చేశాక చంద్రబాబు సైలెంట్ ఎందుకో.. షర్మిల ఆసక్తికర ట్వీట్

ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిల ఏపీ సీఎం చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.

Update: 2024-07-01 07:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిల ఏపీ సీఎం చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ‘బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ తీర్మానం చేసి మోడీ ముందట డిమాండ్ పెడితే.. ఏపీకి హోదాపై చంద్రబాబు గారు కనీసం నోరు విప్పడం లేదు. మోడీ సర్కార్‌లో కింగ్ మేకర్‌గా ఉన్న మీరు.. హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజధాని లేని రాష్ట్రంగా బీహార్ కంటే వెనకబడి ఉన్నామని మీకు తెలియదా ? 15 ఏళ్లు హోదా కావాలని అడిగిన రోజులు మీకు గుర్తులేదా..? రాష్ట్ర అభివృద్ధిలో ఏపీ 20 ఏళ్లు వెనకబడిందని చెప్పింది మీరే కదా ? హోదా ఇవ్వకుంటే మద్దతు ఉపసంహరణ అని ఎందుకు అడగడం లేదు..? మోసం చేసిన మోడీతో హోదాపై సంతకం ఎందుకు పెట్టించలేరు ? ప్రత్యేక హోదాపై మీ వైఖరి ఏంటో చెప్పాలని, రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర హోదా డిమాండ్ పెట్టాలని, చంద్రబాబు గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ప్రత్యేక ప్యాకేజీలు కాదు...రాష్ట్ర అభివృద్ధికి హోదా ఒక్కటే మార్గమని అని గుర్తు చేస్తున్నాం.’ అని షర్మిల ట్వీట్ చేశారు.  


Similar News