చంద్రబాబుకు ఎదురుదెబ్బ: లీగల్ ములాఖత్ పిటిషన్ తిరస్కరణ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టులో మరో షాక్ తగిలింది.
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టులో మరో షాక్ తగిలింది. చంద్రబాబు నాయుడు లీగల్ ములాఖత్ల సంఖ్య మూడుకు పెంచాలని కోరుతూ చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. చంద్రబాబుకు లీగల్ ములాఖత్లు రోజుకు రెండు ఉండేవి. అయితే జైలు అధికారులు కేవలం ఒక్కసారి మాత్రమే ములాఖత్కు అనుమతి ఇచ్చారు. దీంతో ములాఖత్ల సంఖ్యను మూడుకు పెంచాలని కోరుతూ చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విజయవాడ ఏసీబీ కోర్టు గురువారం వాదనలు విని విచారణను శుక్రవారంకు వాయిదా వేసింది. అయితే శుక్రవారం ఉదయం ఈ కేసుపై విచారణ చేపట్టిన విజయవాడ ఏసీబీ కోర్టు ప్రతివాదుల పేర్లు చేర్చకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. లీగల్ ఫార్మెట్లో పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ పిటిషన్ను తిరస్కరించింది. దీంతో చంద్రబాబు నాయుడు లీగల్ ములాఖత్ల విషయంలో ఎదురుదెబ్బ తగిలినట్లైంది.