చంద్రబాబు ప్రజల్ని మోసం చేస్తున్నారు..ఆ ప్రాజెక్ట్ కట్టింది వైఎస్ ఆర్

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

Update: 2024-01-28 08:02 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అటు అధికార పార్టీ నేతలకు ఇటు విపక్షాలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీలకి మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమనేలా ఉంది ప్రస్తుతం పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని అందుకే అనాలోచితంగా మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టును వైఎస్ ఆర్ పూర్తిచేశారని.. కానీ.. ఆ ప్రాజెక్టు నేనే తెచ్చానంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటూ.. అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రాయలసీమ కరవు కాటకాలతో తల్లడిల్లిందని ఆయన మండిపడ్డారు. వాత్సవానికి హంద్రీనీవా ప్రాజెక్టును 5 టీఎంసీలకు కుదించిన ద్రోహి చంద్రబాబు అని దుయ్యబట్టారు. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసి.. ఆ ప్రాజెక్టును 40 టీఎంసీలకు పెంచిన ఘనత మహానేత.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికె దక్కుతుందని పెకొన్నారు.

ఇక రానున్న ఎన్నికల్లో అధికారం చేపట్టేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని.. అందుకే భహిరంగ సభలు పెడుతున్నారని మండిపడ్డారు. ఇక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు ఆయన దిగజారుడు రాజకీయాలకు అద్దంపడుతున్నాయని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు.

ఇక టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా చంద్రబాబుకు ఏమాత్రం తీసిపోరని.. యదా రాజా తదా ప్రజా అన్నట్లు రాష్ట్రం లో అభివృద్ధి జరగకుండా టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుపడితే.. ఉరవకొండ నియోజకవర్గం లో అభివృద్ధి జరగకుండా అడుగడుగునా అడ్డుపడిన వ్యక్తి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అని విమర్శల జల్లు కురిపించారు. 

Tags:    

Similar News