IPS AB Venkateswara Rao: వచ్చిన సస్పెన్షన్ చెల్లదు.. సీఈసీకి సీనియర్ ఐపీఎస్ లేఖ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఎన్నికలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే.

Update: 2024-05-19 09:17 GMT

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఎన్నికలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎన్నికలు జరుగుతున్న రోజు, అలానే మరుసటి రోజు రాష్ట్రంలో పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఘర్షణలను చోటు చేసుకుంటాయి అని తెలిసి కూడా నిర్లక్ష్యం వహించిన కొంతమంది అధికారులపై ఈసీ వేటు వేసింది.

క్రమంలో సీనియర్ ఐపీఎస్ ఏవి వెంకటేశ్వరరావు సైతం సస్పెండ్ అయ్యారు. అయితే తాజాగా ఆయన సీఈసీకి లేఖ రాశారు. ఆ లేఖలో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం తనకు పోస్టింగ్ ఇప్పించాలని కోరారు. అయితే తనకు పోస్టింగ్ ఇవ్వడంలో జాప్యం జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు. అలానే తాను ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారని, ఈ నేపథ్యంలో తనపై సస్పెన్షన్ చల్లదని CAT ఇటీవల ఇచ్చిన తీర్పు కాపీని సీఈసీకి, ఎన్నికల ప్రధాన అధికారికి పంపారు.  


Similar News