Somireddy: ఆస్తుల కోసం తల్లీ, చెల్లిపై కోర్టుకెళ్లడం జగన్ క్రూరత్వం: సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆస్తుల కోసం సొంత కుటుంబ సభ్యులైన వైఎస్ షర్మిల (YS Sharmila), వైఎస్ విజయమ్మ (YS Vijayamma)పై జగన్ (Jagan) కోర్టుకు వెళ్లడం అతడి క్రూరత్వానికి నిదర్శనమని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (MLA Somireddy Chandramohan Reddy) ఆరోపించారు.

Update: 2024-10-24 09:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆస్తుల కోసం సొంత కుటుంబ సభ్యులైన వైఎస్ షర్మిల (YS Sharmila), వైఎస్ విజయమ్మ (YS Vijayamma)పై జగన్ (Jagan) కోర్టుకు వెళ్లడం అతడి క్రూరత్వానికి నిదర్శనమని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (MLA Somireddy Chandramohan Reddy) ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ రూ.లక్షల కోట్ల ప్రజా ధనాన్ని వెనకేసుకున్నాడని ఫైర్ అయ్యారు. చివరకు ఆస్తుల విషయంలో తల్లీ, చెల్లిని సైతం బ్లాక్‌మెయిల్ చేసేందుకు కూడా వెనుకాడటం లేదని మండిపడ్డారు.

ఈ పరిణామంతో వైఎస్ జగన్‌ (YS Jagan)ను మాజీ సీఎం (Former Cm) అని సంబోధించాలన్నా తనకు నోట మాట రావడం లేదని అతడిని చూస్తేనే అసహ్యం వేస్తోందని ధ్వజమెత్తారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల ఆస్తులను కూడగట్టే విషయంలో జగన్ నెంబర్‌వన్ అంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వ (YCP Government) హయాంలో సరస్వతీ పవర్‌ (Saraswathi Power)కు 1,500 ఎకరాల భూమిని లీజుకు ఇచ్చారని.. ఆ లీజును మళ్లీ 30 ఏళ్ల పాటు జగన్ పొడిగించారని ఆరోపించారు. అయితే, ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి పనులు చేపట్టకపోవడం అగ్రిమెంట్‌కు ప్రకారంగా చూస్తే చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. చనిపోయిన తండ్రిని ఈడీ (ED) కేసులో ముద్దాయిగా చేసి.. ఆస్తుల కోసం సొంత చెల్లి, తల్లీపై మాజీ సీఎం జగన్ (Former CM Jagan) కోర్టు మెట్లు ఎక్కడం విడ్డూరంగా ఉందని సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు.


Similar News