కుటుంబంలో తీవ్ర విషాదం.. రిసెప్షన్‌కు వెళ్తుండగా కారును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని రైల్వే కోడూరు మండలం రాజానగర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Update: 2024-10-24 10:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని రైల్వే కోడూరు మండలం రాజానగర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఏపీ ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు(RTC Electrical Bus) ఇన్నోవా కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారులోని ప్రయాణికులు కర్నూల్ నుంచి తిరుపతికి రిసెప్షన్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఘటన స్థలంలో ఒకరు, చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు.

మృతి చెందిన వారిలో కర్నూల్ జిల్లా ఎల్లూర్ నగర్‌కు చెందిన రావూరి ప్రేమ్ కుమార్(51), నరసింహారెడ్డి నగర్ చెందిన కామిశెట్టి సుజాత(40), ఎల్లూరు నగర్‌కు చెందిన రావూరి వాసవి(47)లు ఉన్నారు. క్షతగాత్రులను 108లో రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. వివాహ రిసెప్షన్‌కు వెళుతున్న వారు ఆనందంగా గడపాల్సింది పోయి ముగ్గురు మృత్యువాత పడటంతో బంధువులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Similar News