Twitter war:సాయిధరమ్ తేజ్ Vsవైసీపీ ఫ్యాన్స్..ఇంతకి ఏం జరిగిందంటే?
ఏపీలో ఈ ఏడాది మే 13వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయం సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
దిశ,వెబ్డెస్క్:ఏపీలో ఈ ఏడాది మే 13వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయం సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించింది. ఎన్నికల సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తరఫున సిని హీరోలు సైతం ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే మెగా హీరో సాయి ధరమ్ తేజ్, వైసీపీ అభిమానుల మధ్య ప్రస్తుతం ట్వీట్ వార్ నడుస్తోంది. సోషల్ మీడియాలో సాయిధరమ్ తేజ్ను YCP అభిమానులు టార్గెట్ చేశారు. AP భద్రమైన చేతుల్లో ఉందని గతంలో తేజ్ చేసిన ట్వీట్ను ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరుగుతుంటే ఎందుకు స్పందించట్లేదని ఎక్స్లో పోస్టులు చేస్తున్నారు. APలో సేఫ్ హ్యాండ్స్ మిస్సింగ్ అని అంటున్నారు. దీనికి ఆయన ‘ఎగ్ పఫ్స్’ కామెంట్స్ చేయడంతో దమ్ముంటే ఆధారాలు పెట్టాలని సవాల్ విసురుతున్నారు. అదే రీతిలో జనసేన ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు.
అసలు విషయంలోకి వెళితే..వైసీపీ అభిమాని డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి ట్విట్టర్లో ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. రాష్ట్రంలో పరిస్థితులపై ఎప్పటికప్పుడూ తన అభిప్రాయాలను ట్విట్టర్లో పంచుకుంటారు. ఈ నేపథ్యంలోనే సోమవారం చింతా ప్రదీప్ రెడ్డి తణుకులో అన్న క్యాంటీన్లో మురికి నీటిలో ప్లేట్లు కడిగిన ఘటనపై స్పందించారు. ‘మెడలు రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ సాయి ధరమ్ తేజ్, తణుకులో అన్న క్యాంటీన్లో ప్లేట్లు కడగొచ్చుగా సేఫ్ హ్యాండ్స్తో అంటూ ట్వీట్’ చేశారు. ఈ ట్వీట్కు స్పందించిన సాయి ధరమ్ తేజ్..‘ఎగ్ పఫ్స్ బిల్లు ఎక్కువైంది, మీరు బాగా తిని ఉంటారు’ అంటూ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన చింతా ప్రదీప్ రెడ్డి తనకు తాను ఎగ్పఫ్లు కొనుక్కుంటానని, మరొకరి సాయం అవసరం లేదంటూ సాయి ధరమ్ తేజ్కు కౌంటర్ ఇచ్చారు. తాను ఏదైతో చెప్తానో ఆ విషయాన్ని ఆచరిస్తానంటూ సాయి ధరమ్ తేజ్కు చురకలు అంటించారు. తర్వాత సాయిధరమ్తేజ్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.