విషాదం.. గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. బాపట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రేపల్లె నుంచి చీరాల వస్తుంది.

Update: 2024-10-16 04:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. బాపట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రేపల్లె నుంచి చీరాల వస్తుంది. బస్సు వేగంగా వెళ్తున్న సమయంలో డ్రైవర్ కి గుండెపోటు వచ్చింది. దీంతో బస్సును ఆపే క్రమంలో పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రయాణికులు అప్రమత్తమై కిందకు దించేలోపే డ్రైవర్ డి. సాంబశివరావు చనిపోయారు. కాగా బస్సును అదుపుచేసే క్రమంలో ఓ సైకిల్ ను ఢీకొట్టగా.. సైకిల్ పై వెళ్తున్న వ్యక్తి కాలు విరిగినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రమాదం సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నారని.. డ్రైవర్ తాను చనిపోతున్నప్పటికి చాక చక్యక్తం బస్సును అదుపుచేయడంతో అందరూ క్షేమంగా బయటపడ్డారని.. ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News