అమరావతి నిర్మాణానికి ఊహించని రేంజ్‌లో విరాళం ప్రకటించిన రామోజీ రావు కుమారుడు

అమరావతి రాజధాని నిర్మాణానికి ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, తెలుగు మీడియా దిగ్గజం దివంగత రామోజీరావు కుమారుడు కిరణ్‌ భారీ విరాళం

Update: 2024-06-27 13:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమరావతి రాజధాని నిర్మాణానికి ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, తెలుగు మీడియా దిగ్గజం దివంగత రామోజీరావు కుమారుడు కిరణ్‌ భారీ విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి తన వంతుగా రూ.10 కోట్లు విరాళం ఇస్తు్న్నట్లు కిరణ్ అనౌన్స్ చేశారు. గురువారం విజయవాడలోని కానూరు అనుమోలు గార్డెన్స్‌లో రామోజీ రావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభ వేదికగా అమరావతికి కిరణ్ విరాళం ప్రకటించారు. కాగా, వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యం కారణంగా ఇటీవల రామోజీ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామోజీ రావు కుటుంబ సభ్యులు గురువారం విజయవాడలో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, డైరెక్టర్ రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, సీనియర్ హీరోయిన్స్ జయప్రధ, జయసుధ తదితరులు హాజరయ్యారు.


Similar News