Rajini: ఐదు దశాబ్దాల గమనంలో ఏడుగురు మిత్రులు.. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఐదు దశాబ్దాల జీవన గమనంలో ఏడుగురు మిత్రులు అంటూ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర ట్వీట్ చేశారు.

Update: 2024-09-23 14:07 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఐదు దశాబ్దాల జీవన గమనంలో ఏడుగురు మిత్రులు అంటూ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర ట్వీట్ చేశారు. 1972-73 సంవత్సరాల్లో కలిసిన తన స్నేహితులు 70 సంవత్సారాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 'సాగర తీరాన సప్తతి' అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారిని సన్మానించారు. ఈ కార్యక్రమ విషయాలను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో ఐదు దశాబ్దాలకు పైగా నా జీవన గమనంలో నాతో కలిసి నడిచి, నా తోడుండిన ఏడుగురు ఆత్మీయ మిత్రులు 70 వసంతాలను పూర్తి చేసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా విశాఖలో జరిగిన "సాగర తీరాన సప్తతి" కార్యక్రమంలో నా శ్రీమతి ఉషమ్మతో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మిత్రులు, వారి శ్రీమతులు, కుటుంబ సభ్యులందరితో మాట్లాడడం, నాటి సంగతులని చర్చించుకోవడం చక్కని అనుభూతులను అందించిందని చెప్పారు. నాటి జ్ఞాపకాలు మనసుని మరింత ఉత్తేజితం చేశాయని, ఈ కార్యక్రమంలో 70 మందికి పైగా పాతకాలం మిత్రులను కలుసుకోవడం మరింత సంతోషాన్ని అందించిందని వెల్లడించారు.

తన ఏడుగురు మిత్రులలో మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు, వీరమాచనేని రంగ ప్రసాద్, అట్లూరి అశోక్, తుమ్మల రంగారావు, త్రిపిరినేని జేజి ప్రసాద్, బిక్కిన లక్ష్మణ ప్రసాద్, సూర్యదేవర జోగేంద్ర దేవ్ వారి దంపతులు విజయవంతంగా అర్థవంతంగా 70వ వసంతంలోకి అడుగుడిన శుభ సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. ఇక వారి భవిష్య జీవితం ఆరోగ్యకరంగా మరింత అర్థవంతంగా ముందుకు సాగాలని, వారి కుటుంబాలు ప్రగతి పథంలో పయనించాలని ఆకాంక్షిచారు. ఈ కార్యక్రమంలో ఉన్న సమయంలో.. తాను ఉన్నచోటే నేను ఉన్నానని తెలుసుకొని, స్వయంగా వచ్చి తనను కలిసి వెళ్లిన ఆత్మీయ మిత్రులు సినీ నటులు రజనీకాంత్ కి ధన్యవాదాలు తెలిపారు. స్నేహానికి వారు ఎంత విలువనిస్తారు అని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ అని వివరించారు. అలాంటి మంచి మనసు కలిగిన వారికి భగవంతుడు ఆయురారోగ్యాలను అందించాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని వెంకయ్యనాయుడు రాసుకొచ్చారు.



 



Similar News