డీజీపీతో సీఎం భేటీ.. లడ్డూ వివాదంపై సంచలన నిర్ణయం

తిరుమల లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు..

Update: 2024-09-23 14:56 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ వివాదం(Tirumala Laddu Issue)పై సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) సంచలన నిర్ణయం తీసుకున్నారు. లడ్డూ కల్తీ ఘటనపై విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(Special Investigation Team)ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు సచివాలయంలో పోలీసు, ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యారు. సిట్ ఏర్పాటుపై చర్చిస్తున్నారు. సిట్ చీఫ్‌గా సీనియర్ ఐజీ నియమాకంపైనా సమాలోచనలు చేస్తున్నారు. అధికారులు శ్రీకాంత్, త్రిపాఠి, వినీత్ పేర్లను పరిశీస్తున్నారు. నెయ్యి(Ghee) కొనుగోలు, టెండర్(Tenders) ప్రక్రియపై సిట్ అధికారులు విచారణ చేపట్టనున్నారు. సిట్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయనున్నారు.


Similar News