రాష్ట్రానికి మరో నాలుగు రోజుల పాటు వర్ష సూచన

నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2024-07-01 14:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే రుతుపవనాలకు తోడు దట్టమైన మేఘాలు అలుముకోవడంతో ఏపీలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా మరో నాలుగు రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐఎండీ ప్రకారం పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. అలాగే కొన్ని చోట్ల ఈదురు గాలులు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవనున్నాయని తెలిపింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఇప్పటికే కురుస్తున్న వర్షాల కారణంగా నిండుకుండలా మారిన చెరువులు, వాగుల పై దృష్టి సారించారు. సాధారణ ప్రజలను వరదలు వచ్చే ప్రాంతాల వైపు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు.


Similar News