లడ్డూ వివాదంలో ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్

తిరుమల లడ్డూపై దేశవ్యాప్తంగా జరుగుతున్న వివాదం సంగతి తెలిసిందే.

Update: 2024-09-30 10:59 GMT

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూపై  జరుగుతున్న వివాదం సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో.. ఎలాంటి పూర్తి ఆధారాలు లేకుండా లడ్డూలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగినట్టు ప్రభుత్వం ప్రకటన చేయడంపై సుప్రీంకోర్టు మండి పడింది. అలాంటి ప్రకటనలు చేస్తూ కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) స్పందించారు. 'దయచేసి దేవుడిని మీ రాజకీయాల్లోకి లాగకండి, హ్యాష్ ట్యాగ్ జస్ట్ ఆస్కింగ్' అంటూ తన ఎక్స్(X) ఖాతా వేదికగా పోస్టు చేశారు. తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Nayudu) సంచలన ఆరోపణలు చేసినప్పటి నుండి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు నటుడు ప్రకాష్ రాజ్ కు మాటల యుద్దం నడుస్తున్న సంగతి తెలిసిందే. 


Similar News