AP News:‘ప్రజలు మన వైపే ఉన్నారు’..మాజీ సీఎం జగన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-01 13:15 GMT

దిశ,వెబ్‌డెస్క్:వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు (ఆదివారం) వైఎస్ జగన్ పులివెందులలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..కార్యకర్తలు ఎవరూ అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. అందరికీ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఐదేళ్ల పాలనలో అన్నీ మంచి పనులు చేశామని వెల్లడించారు. మనం చేసిన మంచి ప్రతి కుటుంబంలో ఉందని తెలిపారు. ప్రజలు మనవైపే ఉన్నారనే విశ్వాసం తనకు ఉందని అన్నారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ పోరాటాలు చేద్దామని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలకు అండగా నేతలు నిలబడాలని పేర్కొన్నారు.


Similar News