రాజమహేంద్రవరం చేరుకున్న పవన్ కల్యాణ్.. భారీ ర్యాలీ

రాజమహేంద్రవరంవలో జనసేన, తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం జరగనుంది.

Update: 2023-10-23 08:56 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రాజమహేంద్రవరంవలో జనసేన, తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరం చేరుకున్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయం చేరుకున్న పవన్ కల్యాణ్‌కు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేశ్, పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ, జిల్లా నాయకులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, అత్తి సత్యనారాయణ, వై.శ్రీను, బత్తుల బలరామకృష్ణ, తుమ్మల బాబు, శెట్టిబత్తుల రాజబాబు, డీఎంఆర్ శేఖర్, టీవీ రామారావు, విడివాడ రామచంద్రరావు, బండారు శ్రీనివాస్, ప్రియా సౌజన్య తదితరులు శ్రీ పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. పవన్ కల్యాణ్‌తోపాటు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సైతం రాజమహేంద్రవరం చేరుకున్నారు. అక్కడ నుంచి పవన్ కల్యాణ్ నేరుగా భారీ కాన్వాయ్‌తో మంజీర హోటల్‌కు బయలుదేరారు. మరికాసేపట్లో టీడీపీ-జనసేన పార్టీలకు సంబంధించి సమన్వయ కమిటీ తొలి సమావేశం జరగనుంది.

Tags:    

Similar News