AP Politics: పాదయాత్రలో పవన్ కళ్యాణ్.. ఆ అదృష్టం మాకెప్పుడు వస్తుందో..?

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

Update: 2024-04-02 09:12 GMT

దిశ వెబ్ డెస్క్: ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రతి పార్టీ రానున్న ఎన్నికల్లో గెలుపే ద్యేయంగా అడుగులు వేస్తోంది. ఇక పార్టీ నేతలు భహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజల్లో ప్రజలుగా కలిసిపోతున్నారు. రానున్న ఎన్నికల్లో అధికారం చేరకుండా చూసుకునేందుకు అధికార పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం, మేమంతా సిద్ధం సభలు నిర్వహిస్తున్నారు.

అలానే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకునేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబుతో పాటు కుటుంబ సభ్యులందరూ వివిధ కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో పార్టీని బలోపితం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పాదయాత్ర చేపట్టారు. తాజాగా ఆయన పిఠాపురం నియోజకవర్గం పొన్నాడ గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను పలకరించారు.

అలానే ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోని జనసేన పార్టీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దీనితో ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. అయితే ఆ వీడియో చూసిన పవన్ ఫాన్స్ ఆ అదృష్టం మాకెప్పుడు కలుగుతుందో అని కామెంట్లు చేస్తున్నారు. 

Read More..

బైబిల్ సూక్తి నాకు దిక్సూచి: జనసేనాని పవన్ కల్యాణ్  

Tags:    

Similar News