Breaking:కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్గా పి.కృష్ణయ్య
ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీని(replacement) ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రారంభించింది
దిశ,వెబ్డెస్క్: ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీని(replacement) ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నామినేటెడ్ పదవులపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (Andhra Pradesh Pollution Control Board) ఛైర్మన్గా పి.కృష్ణయ్యను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అయిన కృష్ణయ్య మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో APIIC ఛైర్మన్గా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు.