Pawan Kalyan: సరస్వతి పవర్ సంస్థ భూములకు అనుమతులు ఉన్నాయా?

పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లో సరస్వతి పవర్ సంస్థ అనుమతులపై నివేదిక ఇవ్వాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు.

Update: 2024-10-25 16:49 GMT

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లో సరస్వతి పవర్ సంస్థ(Saraswati Power Company)కు చెందిన భూములకు అనుమతులు ఉన్నాయా?.. లేవా అనే అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) దృష్టి సారించారు. ఈ మేరకు ఆయన ఆరా తీశారు. సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూముల్లో అటవీ లాండ్స్ ఉంటే తనకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సరస్వతి పవర్ సంస్థ సంస్థకు చెందిన 1515.93 ఎకరాల్లో ప్రకృతి సంపద, వాగులు, వంకలు, కొండ భూములు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై స్పందించిన పవన్ కల్యాణ్ అధికారులతో మాట్లాడారు. ఆ సంస్థకు చెందిన భూముల్లో వాగులు, వంకలు, కొండలు ఉన్నందున పర్యావరణ అనుమతులు ఎలా వచ్చాయనేది తనకు తెలియచేయాలని పీసీబీని ఆదేశించారు. ఇక ఈ అంశంపై అటవీ, రెవెన్యూ, పీసీబీ ఉన్నతాధికారులతో సమీక్షించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. 


Similar News