నారాయణ ఆసుపత్రికి రూ.5 లక్షల జరిమానా.. వినియోగదారుల కోర్టు తీర్పు

ఓ రోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహించి అరచేతి పక్షవాతానికి కారణమైనట్లు నిర్ధారించి బాధితుడికి రూ.5 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలంటూ నెల్లూరు నారాయణ హాస్పిటల్ యాజమాన్యాన్ని జిల్లా వినియోగదారుల కోర్టు ఆదేశించింది.

Update: 2024-10-26 01:39 GMT

దిశ, నెల్లూరు ప్రతినిధి: ఓ రోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహించి అరచేతి పక్షవాతానికి కారణమైనట్లు నిర్ధారించి బాధితుడికి రూ.5 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలంటూ నెల్లూరు నారాయణ హాస్పిటల్ యాజమాన్యాన్ని జిల్లా వినియోగదారుల కోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా కొడవలూరుకు చెందిన భవన నిర్మాణ కూలి షేక్ మక్సూద్ 2009 డిసెంబర్ 1న లాంగ్ బోన్ ఫ్రాక్చర్‌కు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.

డిశ్చార్జ్ తరువాత విపరీతమైన చేతి వాపు, నొప్పితో బాధపడుతున్న ఆయనకు రెండోసారి శస్త్ర చికిత్స చేయించుకున్న తరువాత కూడా ఫలితం లేకపోయింది. బాధితుడికి అరచేతి పక్షవాతం వచ్చింది. ఆ తరువాత అదే ఆసుపత్రిలో ఫిజియోథెరపీ చేయించుకున్నా ఫలితం లేకపోవడంతో బాధితుడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. విచారించిన న్యాయమూర్తి.. బాధితుడికి రూ.5,01,490 నష్ట పరిహారం, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు చెల్లించాలని తీర్పును వెల్లడించారు.


Similar News