19న మళ్లీ ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు.. రాష్ట్ర కమిటీతో భేటీ!

ఈ నెల 19న టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్ కు మరోసారి రానున్నారు.

Update: 2024-07-08 16:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 19న టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్ కు మరోసారి రానున్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులతో భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యచరణ, సభ్యత నమోదు, గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పార్టీ సీనియర్ నేతలంతా భవన్ కు రావాలని హింట్ ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామని, పునర్ వైభవం తీసుకొస్తామని బాబు ప్రకటించారు. అందులో భాగంగానే సమీక్షలు, సమావేశాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు సమాచారం. పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరి నియమిస్తారనేది కేడర్ లో సర్వత్రా చర్చకొనసాగుతుంది.

ఇప్పటికే ఆశావాహులు సైతం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. యువనేతకే పదవి అంటూ హింట్ ఇచ్చారు. దీంతో ఈ నెల 7న భవన్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళనం తర్వాత నేతలతో భేటీలోక్లారిటీ వస్తుందని ఆశించినప్పటికీ ఇవ్వకపోవడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం చంద్రబాబును కలువడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇంకా కొంతమంది మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు సైతం బాబును కలిసే ప్రయత్నం చేయడం, పాతకాపులంతా మళ్లీ టీడీపీకి వచ్చేందుకు సంప్రదింపులు సైతం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ఈ నెల 19న మళ్లీ భవన్ కు వస్తున్నారని, నేతలతో భేటీ అవుతారని, అధ్యక్ష పదవిపై, పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదీ ఏమైనప్పటికీ చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.


Similar News