ప్రాణాలు పోతున్నాయ్ సార్.... మీరొచ్చాక: శ్యామల సంచలన వ్యాఖ్యలు

పుంగనూరులో బాలిక హత్య ఘటనపై వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు.....

Update: 2024-10-06 14:58 GMT

దిశ, వెబ్ డెస్క్: పుంగనూరు(Punganur)లో బాలిక హత్య ఘటనపై వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల(YSRCP Spokesperson Syamala) ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu), ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(AP Deputy CM Pawan Kalyan)పై ఆమె మండిపడ్డారు. కూటమి పాలనపై తీవ్ర విమర్శలు చేశారు నిండు పున్నమిలాంటి రాష్ట్రాన్ని అమావాస్య చీకట్లు కమ్ముకున్నాయంటూ ధ్వజమెత్తారు. ఆడపిల్లలు అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగే ఈ దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ పరిస్థితిలేదని శ్యామల వ్యాఖ్యానించారు. 

‘‘ఓట్ల కోసం గ్యారంటీ హామీలతో ప్రజలను బురిడీ కొట్టించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ పాలనలో పసిబిడ్డలు సైతం జంకుతున్నారు. పొద్దుకు పదిసార్లు పొంగనాలు కొట్టే పోశెట్టి.. పుంగనూరు ఘటనపై ఏమంటారు. అన్నయ్య అన్నావంటే ఎదురవనా అంటూ ప్రచారాల సమయంలో సినిమా డైలాగులు కొట్టి అధికారంలోకి ఇప్పటి నాయకులు జరుగుతున్న అఘాయిత్యాలపై, అత్యాచారాలపై నోరుమెదపరేం స్వామి. రామరాజ్యాన్ని రావణ కష్టాంగా మార్చిన ఈ కూటమి పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకపోవడం సిగ్గు చేటు. మాకు మా ఆడపిల్లల మానప్రాణాలే ముఖ్యం. చంద్రబాబు సొంత జిల్లాలో అఘాయిత్యం జరిగితే ఏమీ అనిపించడం లేదా..?. ప్రాణాలు పోతున్నాయ్ సార్.. మీరొచ్చాక.’’ అని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు.


Similar News