ముత్యపు పందిరి వాహనంపై ఊరేగిన శ్రీ మలయ్యప్పస్వామి

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

Update: 2024-10-06 15:49 GMT

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడవ రోజు శ్రీవెంటేశ్వరస్వామి శ్రీమలయ్యప్పస్వామి రూపంలో దర్శనం ఇచ్చారు. కాగా నేటి రాత్రి శ్రీమలయ్యప్పస్వామి వారు ముత్యపు పందిరి వాహనం మీద ఊరేగారు. పురాణాల ప్రకారం ఈ ప్రత్యేక వాహనానికి గల విశేషం ఏమిటంటే.. ముత్యాలను జ్యోతిష్యశాస్త్రంలో చంద్రునికి ప్రతీకలుగా భావించగా.. అదిశేషువు పడగలను ముత్యపు పందిరితో పోలుస్తారు. ముత్యపు పందిరిని దర్శించిన వారికి ఆదిశేషును దర్శించిన పుణ్యం లభిస్తుందని ప్రతీతి. చంద్రుని వంటి చల్లని ముత్యాల పందిరి కింద ఊరేగుతున్న శ్రీవారిని దర్శనం చేసుకుంటే అన్ని వికారాలను పోగొట్టి, జీవితానికి ప్రశాంతత చేకూరుతుందని భక్తులు నమ్ముతారు.   


Similar News