IT మినిస్టర్‌గా నారా లోకేష్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..!

ఏపీలో కొత్తగా కొలువుదీరిన ఎన్డీయే కూటమిలో మంత్రులకు నేడు శాఖలు కేటాయించారు.

Update: 2024-06-14 11:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కొత్తగా కొలువుదీరిన ఎన్డీయే కూటమిలో మంత్రులకు నేడు శాఖలు కేటాయించారు. టీడీపీ జాతీయ కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్‌కు చంద్రబాబు నాయుడు ఐటీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, మానవ వనరుల అభివృద్ధి శాఖలను కేటాయించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. హెచ్‌ఆర్‌డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజి శాఖల మంత్రి గా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం కల్పించిన సీబీఎన్ గారికి ధన్యవాదాలు. నాడు పల్లె సేవే పరమాత్ముడి సేవ అని భావించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాల రూపురేఖలు మార్చాను. ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా అనేక కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాను. గత అనుభవం నేర్పిన పాఠాలతో ఇప్పుడు మరింత సమర్ధవంతంగా పనిచేస్తాను. యువగళం పాదయాత్రలో కేజీ నుండి పీజీ వరకూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తానని హామీ ఇచ్చాను. స్టాన్‌ఫోర్డ్‌లో చదువుకున్న నాకు గ్రామీణ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే అవకాశాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తున్నాను. రాష్ట్రానికి ఐటి, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తాను’ అని ట్వీట్ చేశారు. 

Tags:    

Similar News