నా ప్రయాణం టీడీపీ వెంటే.. గాలి వార్తలు నమ్మొద్దు : వంగవీటి రాధ

వంగవీటి మోహనరంగ ఆ పేరులోనే ఏదో తెలియని ఆకర్షణ. ఆయన ఈ లోకాన్ని విడిచి మూడు దశాబ్ధాలు గడుస్తున్న ప్రజల్లో ఆయన నింపిన స్ఫూర్తి ఇంకా చెక్కుచెదరకుండా ఉంది.

Update: 2024-01-16 11:08 GMT

దిశ, వెబ్‌డెస్క్ : వంగవీటి మోహనరంగ ఆ పేరులోనే ఏదో తెలియని ఆకర్షణ. ఆయన ఈ లోకాన్ని విడిచి మూడు దశాబ్ధాలు గడుస్తున్న ప్రజల్లో ఆయన నింపిన స్ఫూర్తి ఇంకా చెక్కుచెదరకుండా ఉంది. బెజవాడలో ఇప్పటికీ ఏదో మూల వంగవీటి మోహన్ రంగా పేరు చెవుల్లో మారుమోగుతుంది. కాపు కుల నాయకుడిగా ముద్రపడినా ఆయన అన్ని సమాజిక వర్గాలకు సమానుడే. ఇక వెనుకబడిన వర్గాలకు ఆయన ఓ దేవుడు. అందుకే చనిపోయినా.. అమరుడైనా ప్రజల గుండెల్లో నిలిచాడు. ఆయన భౌతికంగా దూరమైన ఆయన కొడుకు వంగవీటి రాధకృష్ణ మాత్రం ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అచ్చం తండ్రిలాగే ఆయన ఆశయాలను పునికిపుచ్చుకున్నాడు.

అది అంటుంచితే, ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ గత కొన్ని రోజులగా రాధా టీడీపీ నుంచి వైసీపీకి వెళ్తారనే టాక్ వినిపిస్తుంది. దీంతో ఆ ప్రచారానికి వంగవీటి రాధా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తన ప్రయాణం టీడీపీ వెంటేనని స్పష్టం చేశారు. ఎవడో పుట్టించిన గాలి వార్తలను ప్రజలు నమ్మొద్దని, ఒక వేళ ఎవడైనా అలా వార్తలు ప్రచారం చేస్తే వారిని నిలదీయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైసీపీ కొనసాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించే శక్తి కేవలం టీడీపీకి మాత్రమే ఉందని గుర్తు చేశారు. అదేవిధంగా రాష్ట్రం బాగుపడాలంటే ప్రజలంతా టీడీపీ, జనసేన కూటమిని బలపరచాలని స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు. 

Tags:    

Similar News