మీది కుటుంబ రాజకీయమా.. కుటిల రాజకీయమా..? పురందేశ్వరిపై విజయసాయి రెడ్డి ఫైర్

ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిపై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ పరోక్షంగా మద్దతు ఇవ్వడంతో

Update: 2023-11-04 06:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ పరోక్షంగా మద్దతు ఇవ్వడంతో టీటీడీపీకి చెందిన ఓ బీసీ నేత రాజీనామా చేశారని అన్నారు. కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతోన్న టీడీపీకి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలని ప్రశ్నించారు. మీది కుల రాజకీయమా.. కుటుంబ రాజకీయమా, కుటిల రాజకీయమా అని విమర్శించారు.

ఇదిలా ఉండగా.. ఎంపీ విజయసారెడ్డిపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సీజేఐకి కంప్లైంట్ చేశారు. ఈడీ, ఐటీ, సీబీఐ కేసుల్లో విజయసాయిరెడ్డి పదేళ్లకు పైగా బెయిల్ ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. విజయసాయి రెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు ఎంపీ విజయసాయి రెడ్డిపై విచారణ జరపాలని లేఖలో పురందేశ్వరి కోరారు. 

Read More: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సీజేఐకు పురందేశ్వరి ఫిర్యాదు

Tags:    

Similar News