AP News:వరద బాధితులకు ఎమ్మెల్యే చింతమనేని విరాళం

ఇటీవల వరదల వల్ల ముంపుకు గురైన ప్రజలను ఆదుకునేందుకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ తరఫున నాలుగు లక్షల రూపాయల విరాళాన్ని సీఎం సహాయనిధికి అందించారు.

Update: 2024-09-11 12:55 GMT

దిశ,ఏలూరు:ఇటీవల వరదల వల్ల ముంపుకు గురైన ప్రజలను ఆదుకునేందుకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ తరఫున నాలుగు లక్షల రూపాయల విరాళాన్ని సీఎం సహాయనిధికి అందించారు. ఏలూరులో వరద పరిస్థితిపై సమీక్షించడానికి బుధవారం వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు 4 లక్షల రూపాయల చెక్కును చింతమనేని ప్రభాకర్ స్వయంగా అందజేశారు. ఇటీవల దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన గ్రామ మహిళల బృందం రాజధాని అమరావతి నిర్మాణం కోసం గ్రామంలో సేకరించిన సుమారు 5 లక్షల రూపాయల విరాళం కలిగి ఉన్న డబ్బాను సైతం ముఖ్యమంత్రికి చింతమనేని ప్రభాకర్ అందజేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆశయాల సాధన కోసం దెందులూరు నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.


Similar News