AP News:మాజీ సీఎం జగన్ పై మంత్రి వాసంశెట్టి ఫైర్..!
రాష్ట్రాన్ని జగన్ గుండు కొట్టించారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు.
దిశ ప్రతినిధి,కోనసీమ:రాష్ట్రాన్ని జగన్ గుండు కొట్టించారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రామచంద్ర పురం వ్యాపారులు, ప్రజలు స్వచ్చందంగా వరద బాధితులకు విరాళాలు ఇచ్చారు. వాటిని విజయవాడ తీసుకొని వెళ్లి వరద బాధితులకు అందించారు. ఈ సందర్భంగా విజయవాడ లోని 43 డివిజన్లోని ఊరిమిలానగర్లో ముప్పు వరద ప్రాంతలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ..తలలో పేను కొరకు లాగా రాష్ట్రానికి గుండు కొట్టించిన ఘనత జగన్ మోహన్ రెడ్డి అని విమర్శించారు. బాధితులకు సహాయం, పునరావాసంతో ప్రభుత్వం బాధ్యత పూర్తయిపోయింది అని సీఎం చంద్రబాబు నాయుడు అనుకోవడం లేదు అన్నారు.
విజయవాడ వరదలలో కొన్ని వేల బైక్లు, స్కూటీలు, కార్లు, ఆటోరిక్షాలు వగైరా వాహనాలు దెబ్బ తిన్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు త్వరలోనే వాటి మరమత్తులు లేదా వాహన ఇన్సూరెన్స్ కంపెనీలతో వీలైనంత త్వరగా నష్టపరిహారం చెల్లించే విధంగా మాట్లాడుతున్నారు. వరదలొస్తే బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి ఆహార పొట్లాలు అందించడమే కాదని మనసు ఉంటే అంతకు మించి చాలా చేయవచ్చని సీఎం చంద్రబాబు నాయుడు నిరూపిస్తున్నారు అని తెలిపారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటువంటివి కలలో కూడా ఊహించలేరేమో అని మంత్రి సుభాష్ విమర్శించారు. ముఖ్యమంత్రిగా విఫలమైన జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేతగా కూడా విఫలమవుతున్నారు. వరద బాధితులను పరామర్శించడానికి వచ్చి వారికి ఏ సహాయం చేయకుండా, వారికి ఇంతగా సహాయపడుతున్న ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బురద రాజకీయాలు చేస్తున్నారు. వైసీపి, జగన్ తీరుని ప్రజలు అసహ్యించుకుంటున్నారని కూడా గ్రహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు.